PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెలుగోడులో ఇంటింటికి వ్యాక్సినేషన్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, వెలుగోడు: కరోన వైరస్​ నియంత్రణకు పూర్తిస్థాయిలో కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఎంపీడీఓ అమానుల్లా. మంగళవారం వెలుగోడు పట్టణం చెంచు కాలనీలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఎంపీపీఓ పర్యవేక్షించారు. 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు న్న 45 సంవత్సరాలు దాటినా తల్లులకు వ్యాక్షినేషన్ వేశారు. అదేవిధంగా మండలంలోని 790 మందికి వ్యాక్సినేషన్ వేయాలని లక్ష్యం కాగా సాయంత్రం 5.40 గంటల కు 634 మందికి వేసినట్లు ఎంపిడిఓ తెలిపారు. కార్యక్రమంలో మోత్కూరు పి.హెచ్.సి వైద్యురాలు హారిక , సి.హెచ్.ఓ నాగేశ్వరరావు , ఆరోగ్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు , అంగన్ వాడి వర్కర్లు , వెలుగోడు సచివాలయం-4 పంచాయతీ కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

About Author