NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాడవాడలా బొజ్జగణపయ్య

1 min read

– భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా బొజ్జగణపయ్య కొలువుదీరాడు. దేవాలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. ఆది దేవుడు గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా పలుప్రాంతాలలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ టీటీడీ బోర్డు సభ్యులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author