PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మలబార్​’లో వడ్డాణోత్సవం..

1 min read
  • కర్నూలులో వడ్డాణం మరియు నెక్లెస్​ ఉత్సవ కాంపెయిన్​ను ప్రారంభించిన డా. సావిత్రి

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: భారతదేశంలో అతి పెద్ద బంగారు వ్యాపార సంస్థలలో ఒకటైన మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ శరవేగంగా విస్తరిస్తోంది. బంగారు ప్రియుల అభిరుచికి తగ్గట్టు వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ముందుంటోంది. బుధవారం కర్నూలు షోరూంలో  వడ్డాణోత్సవం మరియు నెక్లెస్​ ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుశీల నేత్రాలయ మరియు మెటర్నటి హాస్పిటల్​ గైనకాలజిస్ట్​ డా. సావిత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. సావిత్రి మాట్లాడుతూ కొనుగోలుదారులకు అనుగుణంగా… కావల్సిన డిజైన్లలో బంగారు ఆభరణాలను తక్కువ ధరకు విక్రయించడం అభినందనీయమన్నారు.  అంతేకాక వచ్చిన లాభాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ షోరూం నిర్వహకులను ప్రశంసలతో కొనియాడారు. అనంతరం షోరూం మేనేజర్​ మాట్లాడుతూ  తమ సంస్థ వినియోగదారుల  అభిప్రాయం, ఇష్టం.. అభిరుచులను దృష్టిలో పెట్టుకుని బంగారు ఆభరణాలను వివిధ డిజైన్లలో తయారు చేస్తోందన్నారు.  ఇతర బంగారు వ్యాపార సంస్థలతో పోలిస్తే…. మలబార్​ గోల్డ్​లో క్వాలిటీ.. క్వంటిటీతోపాటు తక్కువ ధరకు బంగారు ఆభరణాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో నేషనల్​ అవార్డు గ్రహిత షేక్​ జాఫ్రీన్​, కర్నూలు బ్రాంచ్​ మేనేజర్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author