PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైకాపా విజ‌య దుందుభి.. సైకిల్ కు పంక్చర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఎట్టకేల‌కు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఆదివారం రాత్రి 11 గంట‌ల‌ వ‌ర‌కు ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగింది. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల‌కు గాను 2371 స్థానాలు ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. 7219 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. 5,916 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా, 809 స్థానాల్లో టీడీపీ, 164 స్థానాల్లో జ‌న‌సేన‌, 27 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, 15 స్థానాల్లో సీపీఐ, 8 స్థానాల్లో సీపీఎం గెలిచాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 660 జ‌డ్పీటీసీ స్థానాలు ఉండ‌గా వాటిలో 126 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. 515 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిలో వైకాపా 462 స్థానాల్లో, టీడీపీ 6 స్థానాలు, జ‌న‌సేన‌, సీపీఎం ఒక స్థానంలో గెలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ కొన్ని జిల్లాల్లో ఖాతా కూడ తెర‌వ‌లేక‌పోయింది.

About Author