PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపా కు బుద్ధి చెప్పాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాకు మార్చి 13న జరిగే పట్టభద్రుల ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పక్కీర్ సాహెబ్, సిఐటియు పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని అల్లూరు గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పక్కీర్ సాహెబ్ , సిఐటియు పట్టణ కార్యదర్శి టి. గోపాలకృష్ణ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ,రాక్షస పాలన సాగిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ,నిరుద్యోగులను మోసగించిన జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు. పట్టభద్రులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలందరూ పిడిఎఫ్ అభ్యర్థులు కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తుందని వాటికి లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడే పిడిఎఫ్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

About Author