PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వైకుంఠ ఏకాదశి’..కి ఏర్పాట్లు సిద్ధం..

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని  సంకల్ బాగ్ లో కల హరిహరక్షేత్రం లో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో 2 వతేది వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర శర్మ కార్యదర్శి హెచ్ కె రాజశేఖర రావు తెలిపారు. ఈ మేరకు ఆలయకమిటీ కార్యవర్గ సమావేశం లో భక్తుల సౌకర్యం కు కావలిసిన ఏర్పాట్లు గురించి చర్చించి నిర్ణయం తీసుకొన్నారు, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతూ కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చక్కటి  ఆధ్యాత్మిక వాతావరణం లో ఏర్పాట్లు చేస్తున్నారని,2 వతేది ఉదయం 3 గంటలకు స్వామి వారికీ పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వర్తించి 5 గంటలకు సమయానికి భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు రామ మనోహర్, ఉమేష్, విజయసారథి, kv భాస్కర్ రావు, సోమ నాథ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

About Author