NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హరిహర క్షేత్రంలో.. ‘వైకుంఠ ఏకాదశి’

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక హరిహర క్షేత్రం లో వేంకంటేశ్వర స్వామి దేవాలయం లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినారు. ఈ రోజు తెల్లవారుఝమున 3 గంటలకే స్వామి వారికీ పంచామృత అభిషేకం, విశేష పూజలు చేసి స్వామి ఉత్సవ మూర్తుల తో ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేసారు. వేలాదిగా భక్తులు, పుర ప్రముఖులు మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి దంపతులు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ దంపతులు టీజీ వెంకటేష్ సోదరి సంపత్ అమ్మగారు దేవ దేవున్ని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెక్ రాజశేఖర్ రావు, గౌరవ సలహాదారులు హెచ్ కె మనోహర రావు, kg ప్రభాకర్, ఉమేష్ రాజేష్ కమిటీ సభ్యుల తిరుమల తిరుపతి వేద పండితులు సాయి శ్రావణ్ గారు మామిళ్ళపల్లి రాజేష్ గారు ఆలయ పూజారులు ప్రసన్న, సాయి, గురు రాజా గారు  గారు పర్యవేక్షణ లో కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కల్లె చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

About Author