PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంగ‌వీటి రాధాతో వ‌ల్ల‌భ‌నేని వంశీ భేటీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ ఫంక్షన్‌లో కాసేపు వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఈ దృశ్యం కాస్త మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా… స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

                                          

About Author