PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకులను… ‘ఎస్టీ’లో చేర్చాలి

1 min read

వాల్మీకి నేత డా. పార్థసారధి

14న ఎమ్మిగనూరులో వాల్మీకుల రౌండ్​ టేబుల్​ సమావేశం

పల్లెవెలుగు వెబ్​: రాష్ట్రంలోని వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్​ చేశారు వాల్మీకి నేత డా. పార్థసారధి. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ..రాజకీయాలకతీతంగా ఈ నెల 14న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అజంతా ఫంక్షన్​ హాల్​లో జిల్లాస్థాయిలో వాల్మీకుల రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం…ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీ రిజర్వేషన్​లో చేర్చకుండా.. కాలయాపన చేస్తూ… మోసం చేస్తున్నారని ఆరోపించారు.  వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్​ పునరుద్ధరణకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్న వాల్మీకి నేత డా. పార్థసారధి…  ఈనెల 14న జరిగే జిల్లా స్థాయి రౌండ్​ టేబుల్​ సమావేశానికి వాల్మీకులు భారీ స్థాయిలో హాజరై… ఎస్టీ రిజర్వేషన్​ సాధన కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.

 

About Author