NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాల్మీకి బోయలకు చట్ట సభల్లో అధిక సీట్లు కేటాయించాలి

1 min read

వాల్మీకి బోయసేవాసంస్థ అధ్యక్షులు తలారి కృష్ణా నాయుడు

పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులలో సామాజిక వర్గాల్లో సమీకరణలు, కేటాయింపులు అంటూ అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ జనాభా కలిగిన సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయి. కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లా లలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థితిలో ఉన్న వాల్మీకులకు 2 పార్లమెంటు స్థానములు మరియ ఒకొక్కజిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు మేధావి వర్గానికి, యువతకు, ప్రాతినిధ్యం కల్పించాలని అన్ని పార్టీలకు అనంతపురం ఉమ్మడి జిల్లా లో రెండు పార్లమెంటు స్థానాలు హిందూపురం, అనంతపురం, మరియు రాయదుర్గం, కళ్యాణ దుర్గం,గుంతకల్లు అసెంబ్లీ స్థానాలను వాల్మీకులకే కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీల ను డిమాండ్ చేశారు. మరి ముఖ్యంగా జగనన్న ఆశిస్సులతో ఎదిగిన వాల్మీకి సోదరి మణికి గుంతకల్లు లో జరిగిన అవమానాన్ని ఖండిచారు.

About Author