PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీర‌శైవ అభ్యుద‌య స‌మాజం క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వీర‌శైవ అభ్యుద‌య స‌మాజం ఆధ్వ‌ర్యంలో రూపొందించిన నూత‌న సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను క‌ర్నూలు న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లోని కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ ఆవిష్క‌రించారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం వీర‌శైవ సాధికార క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి విసృతంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని నేత‌ల‌ను టి.జి భ‌ర‌త్ అభినందించారు. వీరిలాగే టిడిపి అనుబంధ సంఘాల‌న్నీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి చైత‌న్యం తీసుకురావాల‌ని కోరారు. క‌ర్నూలు న‌గ‌రంలో రాజ‌కీయాల‌కు అతీతంగా తాము ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న‌ట్లు చెప్పారు. అధికారంలో ఉంటే మ‌రింత సేవ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నూలు టిడిపి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు శ్రీనివాస‌మూర్తి, వీర‌శైవ సాధికార క‌మిటీ రాష్ట్ర క‌న్వీన‌ర్ శివ‌రాజు, నేత‌లు మ‌ల్లికార్జున‌ప్ప‌, చంద్ర‌శేఖ‌ర‌ప్ప‌, న‌వీన్‌, నితిన్‌, దామోద‌ర్, గంగాధ‌ర శాస్త్రి, విజ‌య్ బాబు, చంద్ర‌శేఖ‌ర్‌, మ‌హేష్‌, వెంక‌టేశ్వ‌ర్లు, ఉపేంద్ర‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author