NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాహనాలు తనిఖీ… నగదు సీజ్​..

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  కృష్ణ మండల కేంద్రంలోని తెలంగాణ కర్ణాటక సరిహద్దు బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసు సిబ్బంది మరియు ఎక్సైజ్ సిబ్బంది వారు తెలంగాణ రాష్టం సాధారణ ఎన్నికల సందర్బంగా వాహనాలు తనిఖీ చేయుచుండగా ఉదయం అందజగా 6:30 గంటల సమయంలో రాయచూరు నుండి గుర్మీత్కల్ వైపు వెళుతున్న డీసీఎం KA33B3719 నంబరు గల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నడిమింటి భీమ్ రెడ్డి గుర్మీత్కల్ కి చెందిన వ్యక్తి అను వ్యక్తి నుండి 1,20,000 రూపాయలు మరియు డీసీఎం TS06UA9137 నంబరు గల వాహనం రాయచూరు నుండి గుర్మీత్కల్ వెళుతుండగా అందులో గల సదాశివరెడ్డి అను వ్యక్తి నుండి 1,10,000 రూపాయలు లభ్యం అవగా రూపాయలకు గాను ఎటువంటి రసీదు లేకపోగా అట్టి రూపాయలను పంచనామా నిర్వహించి కృష్ణ ఎస్సై విజయబాస్కర్  సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎక్సయిజ్ సీఐ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author