NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తోగట వీర క్షత్రియ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షడిగా వేల్పుల సుబ్రహ్మణ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : తోగట వీర క్షత్రియ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులుగా వేల్పుల సుబ్రహ్మణ్యంను, తొగట వీర క్షత్రియ    రాష్ట్ర అధ్యక్షులు  మోడెమ్ వీరాంజనేయ ప్రసాద్ నియమించినట్లు వేల్పుల సుబ్రహ్మణ్యం తెలిపారు, ఈ సందర్భంగా ఆయన సోమవారం చెన్నూరులో విలేకరులతో మాట్లాడుతూ  తొగట వీర క్షత్రియులకు తాను చేస్తున్న  సమాజ సంఘ సేవలు గుర్తించి తనకు తొగట వీర క్షత్రియ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియమించడం జరిగిందన్నారు, దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుచే తాను నియామక పత్రం అందుకున్నట్లు ఆయన తెలిపారు యువజన సంఘం ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన సందర్భంగా రామనపల్లె గ్రామంలోని తొగట వీర క్షత్రియ యువకులు అలాగే గ్రామస్తులు కలిసి వేల్పుల సుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించడం జరిగింది, తనను నమ్మి నాకు తొగట వీర క్షత్రియ యువజన ఉపాధ్యక్షులుగా  నియమించిన వీరాంజనేయ ప్రసాద్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు, తొగట వీర క్షత్రియ ప్రజలకు అలాగే సంఘానికి ఎల్లవేళలా  అధుభాటులో ఉంటూ తోగట వీర క్షత్రియుల అభివృద్ధి కొరకు తన వంతు నిరంతర కృషి చేస్తానని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో  సుంకర రామచంద్రుడు , గాంగరపు వరుణ్ ,పల్లా రమేష్ ,తప్పెట నరేంద్ర , తొగట వీర క్షత్రియ యువకులు పాల్గొన్నారు.

About Author