PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ సీనియ‌ర్ నేత య‌డ్ల‌పాటి వెంక‌ట్రావు ఇక‌లేరు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజ్యసభ మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‎లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 104 ఏళ్లు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. రైతు నాయకుడిగానూ ఆయన సేవలందించారు. సంగం డైయిరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడుగా ఉన్నారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో యడప్లాటి జన్మించారు. 1967,1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు.

                                   

About Author