PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు, ఈ తనిఖీ లో వారు పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగిందని తెలియజేశారు, ముఖ్యంగా వైద్యులు అలాగే సిబ్బంది యొక్క హాజరు రికార్డులు, అలాగే మందులకు సంబంధించిన రికార్డులు అదేవిధంగా పరికరాలు తనిఖీ చేయడం జరిగింది. ఈ రికార్డులన్నింటినీ తనిఖీ చేసిన పిమ్మట తదుపరి ఇందుకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ తనిఖీలలో భాగంగా మాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ , సిబ్బంది, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు బి చెన్నారెడ్డి, వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొనడం జరిగింది, ఈ తనిఖీలలో ఉమామహేశ్వర్, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, లోకేశ్వర్ రెడ్డి ,డి ఈ ఈ, శ్రీనివాసులు ,ఏజీ, అశోక్ కుమార్, ఏ ఈ ఈ, విజయ్ కిషోర్ ఏ ఈ ఈ, నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

About Author