PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫర్టిలైజర్ షాపుల పై ‘విజిలెన్స్ ’ దాడులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫర్టిలైజర్ షాపులపై మంగళవారం విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుండటంతో దాడులు నిర్వహించడం వల్ల నకిలీ క్రిమిసంహారక పురుగు మందులు రైతులకు అంటకుండా ఉండేందుకు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విజిలెన్స్ దాడులు వల్ల రసాయనిక క్రిమి సంహారక మందులు విక్రయించే వారి గుండెల్లో దడ పుట్టినట్లు తెలుస్తుంది. దాడుల సమయంలో కొన్ని దుకాణాలు మూసివేసినట్లు రైతులు పేర్కొన్నారు. దాడుల్లో విజిలెన్స్ మహేశ్వర్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ ఏవో తదితరులు పాల్గొన్నారు.

About Author