PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవాడ ఎంపీ మద్దతుగా సాయినాథ్​ శర్మ ప్రచారం

1 min read

కమలాపురం, పల్లెవెలుగు:విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ విజయవాడ పార్లమెంటు అభ్యర్ధి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్లంపల్లి శ్రీనివాస్ మద్దతుగా కమలాపురం నియోజకవర్గ ప్రజా నాయకుడు తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ శనివారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణ పురం లో  మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్ స్థానిక నాయకులతో కలిసి సాయినాథ్ శర్మ ఎమ్మెల్యేలను గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా మరో ఐదు సంవత్సరాలు కొనసాగేలా ప్రజల ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కుట్రపూరిత కూటమి ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టే మాటలతో రాష్ట్ర ప్రజానీకానికి తీరని ద్రోహం చేసే ప్రణాళిక అల్లుతున్నారన్నారు. తెలుగుదేశం నాయకుల కళ్లిబోల్లి మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. పేద ప్రజల ఆపద్బాంధవుడిగా నిరుపేదల హృదయాల్లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొలువై ఉన్నారన్నారు. సాయినాథ్ శర్మ తో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో సాయినాథ్ శర్మ అభిమానులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. కడప నుంచి వచ్చి ప్రచారం నిర్వహించినందుకు సాయినాథ్ శర్మకు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటుస్థానిక వైసీపీ నాయకులు అభినందనలు తెలిపారు.

About Author