NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ ..!

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉద్యోగుల ఉద్యమం ఉదృతమవుతోంది. ఫిబ్రవరి 3న చల్ విజయవాడకు ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పీఆర్సీ జీవోను ప్రభుత్వం రద్దు చేయాలని ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఆయన చెప్పారు. న్యాయ పరంగా చిక్కులను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులను నియమించుకున్నామని బొప్పరాజు తెలిపారు. మరోవైపు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధికారికంగా లేఖ రాశారు. స్టీరింగ్‌ కమిటీలోని 20 మంది సభ్యులను ఆహ్వానించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో సమావేశానికి రావాలని సర్క్యులర్‌ జారీ చేశారు.

       

About Author