PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాగి ఉన్న వాస్తవాలను ప్రజలకు చేరవేసేదే ‘పల్లె వెలుగు’

1 min read

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: సమాజంలో దాగి ఉన్న వాస్తవాలను నిజ స్వరూపంలో వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో పల్లెవెలుగు దినపత్రిక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని వైఎస్సార్సీపి మైనారిటీ నాయకులు మోమిన్ మన్సూర్ అన్నారు.2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ తెలియని విషయాలను ప్రజలకు చేరవేయటంలో పత్రిక అనేది కీలకమని అన్నారు.ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా వార్తలు రాసే పల్లె వెలుగు దినపత్రిక సాంకేతిక రంగంలోనూ(డిజిటల్ మీడియా)దూసుకెల్లడం అభినందనీయం అని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో పల్లెవెలుగు పాత్రికేయులు డి.స్వాములు పాల్గొన్నారు.

About Author