PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యం..

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం  :  గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యమని మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి అన్నారు.  మండల పరిధిలోని మాధవరం లో త్రాగునీటి కోసం మరో ముందడుగు వేసి ఆదివారం మాధవరం గ్రామంలో ఎస్సి కాలనీ లో రోజురోజుకు తాగునీటి సమస్య ఎక్కువ అవుతుండంతో  పాడుపడ్డ బోరింగ్ కు గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ అధ్వర్యంలో కొత్త నీటి మోటర్ మరియు పైపు లైన్ వేసి కరెంటు కుళాయి గా మార్చి ప్రజల దాహార్తిని తీర్చడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని నీటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఇందిరమ్మ ,ప్రసాద్, యాకోబు, స్వామిదాసు, ఆరోని, రవి, తోలుఆనంద్, బజారు, నర్సప్ప, సల్మాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author