PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పై ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పై పుట్ట‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఓ రౌడీ అని, ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని పల్లె రఘునాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లుగా టీడీపీ నేతలపై జేసీ కుటుంబం దాడులు చేసింది.. అక్రమ కేసులతో వేధించిందని ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ అజ్ఞాని అంటూ పల్లె మండిపడ్డారు. టీడీపీ కండువా కప్పుకోవటానికి జేసీ నామోషీగా ఫీలయ్యాడంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో టీడీపీలో చేరిన జేసీ కుటుంబం తమపై పెత్తనమా? అంటూ ప్రశ్నించారు. పరిటాలకు భయపడి జేసీ తాడిపత్రి నుంచి పారిపోయాడరన్నారు. నాజోలికి వస్తే ఊరుకోనని పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు.

                                

About Author