PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ

1 min read

పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : విజయరాయి : జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విజయరాయి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. రాట్నాగుంటలో జగనన్నకు చెపుదాము కార్యక్రమానికి హాజరైన డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ ఏలూరు తిరుగు ప్రయాణంలో విజయరాయి సచివాలయం పరిశీలించి సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. సందర్బంగా సిబ్బందితో మాట్లాడుతూ ఈ-గ్రామస్వరాజ్ ప్రగతిపై, నగదురహిత చెల్లింపులపై ఆరాతీశారు. స్పందన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని సిబ్బందిని ఉద్దేశించి డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. కార్యక్రమంలో విస్తరణ అధికారి బి.శ్రీనివాసులు, కార్యదర్సులు ఎం. నీరజ, వలపుల సౌజన్య తదితరులు ఉన్నారు.

About Author