PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి : ఈఓఆర్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని మండల ఈఓఆర్డి ఫకృద్దీన్ అన్నారు.మండల పరిధిలోని రోళ్లపాడు,అలగనూరు గ్రామపంచాయతీలను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామాల్లో కుళాయి మరియు ఇంటి పన్ను వసూళ్లను ఎంతవరకు చేశారంటూ ఆయన పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. పన్ను వసూళ్లలో ఇంకా వేగం పెంచాలన్నారు.డిమాండ్ రిజిస్టర్లు,టాప్ ఫీజు,స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసిన తర్వాత త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించిన తర్వాత వాటిలో క్లోరినేషన్ వేయించాలని అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని అన్నారు.సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి పథకాలు అదే విధంగా చూడాలన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు విజయకుమారి,ఎన్.అనురాధ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author