PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘విశాఖ ఉక్కు’ నిరాహారదీక్షకు.. కాంగ్రెస్​ సంఘీభావం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం లో భాగంగా విశాఖపట్నం విశాఖ ఉక్కు కర్మాగారం దగ్గర జరుగుతున్న ధర్నాకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ కమ్ముల కృష్ణ , ఏపీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి బురదగుంట క్రాంతి సోమవారం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కమ్ములకృష్ణ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రుల ఉక్కు కర్మాగారం తాకట్టు పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధంచేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తన విధి విధానాలను మార్చుకోవాలని, వేలాది కార్మికులు జీవన ఉపాధిని కొల్లగొట్టడం సరికాదని సూచించారు.

About Author