PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశాల్ కు కోర్టు జ‌రిమానా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ హీరో విశాల్ కు ఎగ్మూర్ కోర్టు జ‌రిమానా విధించింది. ఎగ్మోర్‌లోని ఆర్థిక నేరాల కోర్టు రూ.500 అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు గత నెల 17వ తేదీన వెలువరించగా, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నటుడు, నిర్మాత అయిన విశాల్‌పై జీఎస్టీ చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై నేరుగా హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ 2016 నుంచి 2018 మధ్య కాలంలో జీఎస్టీ చెన్నై ప్రాంతీయ కార్యాలయ అధికారులు దాదాపు 10 సార్లు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన పై చర్య తీసుకోవాలని కోరుతూ జీఎస్టీ చెన్నై జోన్‌ అధికారులు ఎగ్మూరులోని ఆర్థిక నేరాల కోర్టులో పిటిషన్‌ వేశారు.

                                    

About Author