NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. బాశెట్టి లతకు  విద్యారత్న విశిష్ట సేవారత్న ప్రధానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పుడమి సాహితీ వేదిక, నల్గొండ, తెలంగాణా వారి ఆధ్వర్యంలో  ఈరోజు నిర్వహించిన పుడమిరత్న పురస్కారాల్లో ” విద్యారత్న విశిష్ట సేవారత్న ” పురస్కారమును  ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి చేతులమీదుగా  డా. భాశెట్టి లత అందుకొన్నారు. తెలుగు భాషా, సాహిత్య రంగాలలో కృషి చేసినందులకు ఆమెకు ఈ పురస్కారం లభించింది. ఈమె కర్నూలు కె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు.ఈ సందర్బంగా డాక్టర్ భాశెట్టి లతను ముద్రిక కళాస్రవంతి అధ్యక్షులు ముద్రిక భాస్కర్,  కెంగార మోహన్, మారేడు రాముడు తోపుదుర్తి వెంకట్రాం, పసుపులేటి నీలిమ పలువురు రచయితలు అభినందనలు తెలియచేశారు.

About Author