PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ చింతలపూడి అభ్యర్థి కంభం విజయరాజు పర్యటన..

1 min read

కార్యకర్తలను, గ్రామ పెద్దలను కలుసుకొని ఓటేసి గెలిపించాలని అభ్యర్థన

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : లింగపాలెం మండలం అన్నపనేని వారి గూడెం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు పర్యటించారు. గ్రామంలో ఉన్న పెద్దలను గ్రామస్తులను విజయ రాజు  ఆప్యాయంగా పలకరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే వైసీపీ అభ్యర్థులను ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిఎస్ఐ చర్చ్ ను విజయ రాజు పరిశీలించారు. దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అఖండ మెజారిటీతో విజయం సాధించాలని చర్చ్ పాస్టర్  ప్రార్థన చేసి విజయ రాజు ని ఆశీర్వదించారు.

About Author