PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్షేత్రస్థాయిలో పర్యటించండి.. ఏపీడి బాలాజీ నాయక్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని బుధవారం నాడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఏపీడి బాలాజీ నాయక్ ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబ్ కార్డుకు ఆధార్ లింకు చేయించాలని బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింకు తప్పనిసరి అని ఉపాధి హామీ సిబ్బంది ప్రతి ఒక్కరూ హార్టికల్చర్ రైతులకు ఇచ్చిన మొక్కలు చనిపోయిన వాటికి రిప్లేస్మెంట్ చేసి కొత్త మొక్కలు నాటేలా చూడాలన్నారు వచ్చే సీజన్లో పని దినాలు కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీ పథకం కింద పని జరుగుతున్న పనులను జియో ట్యాగింగ్ తప్పనిసరి అని సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా పక్కాగా రిజిస్టర్ మైంటైన్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయసింహారెడ్డి. ఈసీ సునీల్ గవాస్కర్. ప్లాంటేషన్ సూపర్వైజర్ వెంకటసుబ్బయ్య . ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

About Author