PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘ఏటిపి’’ పార్టీ వ్యవస్థాపకుడు కర్నూలు జిల్లాలో పర్యటన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఏపీలో రానున్న 2024 ఎన్నికలో భాగంగా ఆల్ తెలుగు ప్రజాపార్టీ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే కటికల శివ భాగ్య రావు  వివిధ జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 14 15 రెండు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు కటికల శివ భాగ్య రావు గారు మాట్లాడుతూ  కర్నూలు జిల్లా పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో పోటీలో నిలుపుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరెకలు లక్ష్మీకాంతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివ భాగ్య రావు  ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. కర్నూలు జిల్లా పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందికొట్కూరు డోన్ కర్నూలు కోడుమూరు నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

About Author