PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న కూటమి అభ్యర్థులు

1 min read

ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు పట్టణం టూ టౌన్. కొత్తపేట లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఎంతో విశిష్టత మరియు ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర గత కొద్దిరోజులు  అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర మహోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్ట మహేష్  మరియు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్ధి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అమ్మవారిని దర్శించుకున్నారు. వారి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి జాతర కార్యక్రమ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

About Author