PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కైపా శ్రీధర్ రెడ్డి బుధవారం రోజున మరణించిన సంగతి తెలిసిందే.విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.జరిగిన సంఘటన గురించి శ్రీధర్ రెడ్డి తండ్రి మాజీ సర్పంచ్ కైపా చంద్ర పుల్లారెడ్డి,కుమారుడు లక్ష్మీ ప్రసన్నకుమార్ రెడ్డి లను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున నేను అంత్యక్రియలకు రాలేకపోయానని కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ ఎన్నికల్లోను పార్టీ కార్యక్రమాల్లోనూ పార్టీకి ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు.పార్టీ మీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని మీరు అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు చెప్పారు.ఈ కార్యక్రమంలో సల్కోటి గోవర్ధన్ రెడ్డి,వీరారెడ్డి,గోపు చంద్రశేఖర రెడ్డి,ఎస్ఐ ఎం జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

About Author