NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రంధాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రకాష్ గురువారం పత్తికొండ శాఖా గ్రంధాలయాన్ని సందర్శించారు. పత్తికొండ శాఖ గ్రంధాల రికార్డులను ఆయన పరిశీలించి గ్రంథాలయ అధికారి రాంకుమార్ రికార్డుల నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయ పన్నును గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలు చట్ట ప్రకారం చెల్లించాలని కోరారు. త్వరలో వెల్దుర్తి, జలదుర్గంలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాలతో పాటు మరికొన్ని గ్రంథాలయాల భవనాలను ప్రారంభిస్తామని తెలియజేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ సాధికారి పత్తికొండ శాఖ గ్రంథలయ అధికారి రామ్ కుమార్ ను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

About Author