PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకా హ‌త్య కేసు.. ఎర్ర‌గంగిరెడ్డి పిటిష‌న్ పై సీబీఐ కౌంట‌ర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎర్రగంగిరెడ్డి వేసిన పిటీషన్‌కు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. సిట్‌ బృందాలు దర్యాప్తులో సేకరించిన నివేదికలు కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎర్రగంగిరెడ్డి 17వ తేదీ పులివెందుల కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు సిట్‌ 1, సిట్‌ 2, సీబీఐ వద్ద ఉన్న డాక్యుమెంట్‌ ప్రతులు తమకు ఇవ్వాలని ఆ పిటీషన్‌లో కోరినట్లు తెలిసింది. దీనిపై శుక్రవారం సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు.

                               

About Author