PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకా హ‌త్య కేసు.. చార్జిషీటు వెన‌క్కి పంపిన కోర్టు !

1 min read

పల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీటును పులివెందుల కోర్టు వెనక్కి ఇచ్చినట్టు స‌మాచారం. ఈ నెల 27వ తేదీ సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంబంధించి నలుగురి పేర్లను ధ్రువీకరిస్తూ పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన పులివెందుల కోర్టు అందులో కొన్ని తప్పులు ఉన్నట్లు గుర్తించింది. వాటిని సరిచేసి ఇవ్వాలని సీబీఐ అధికారులకు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. కోర్టు ప్రస్తావించిన వివరాలను సరిచేసి మళ్లీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

About Author