PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకా హ‌త్య కేసు.. ఆరుగురి విచార‌ణ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మాజీమంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శనివారం ఆరుగురిని విచారించారు. 55వ రోజు వివేకా హ‌త్య కేసు విచార‌ణ జ‌రుగుతోంది. పులివెందులలోని యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్‌, గోవర్ధన్‌, ఓ హోటల్‌ మేనేజర్‌ రాజుతో పాటు మరో ఇద్దరిని విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాచ్ మెన్ రంగ‌య్య స్టేట్ మెంట్ మెజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయించిన సీబీఐ అధికారులు, కీల‌క‌మైన వ్యక్తుల‌ను విచారిస్తున్నారు.

About Author