PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘వి ఓ ఎ’ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

1 min read

పల్లెవెలుగు, వెబ్​ గోనెగండ్ల :మండలపరిధిలో డి ఆర్ డి ఎ-వై కె పి లో వి ఓ ఎ గా అలువాల గ్రామంలో పని చేస్తున్న పరమేష్ కుటుంబానికి జిల్లా లో పనిచేస్తున్న మరియు గోనెగండ్ల మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న వి ఓ ఎ లు అందరి సహకారం తో ఒకలక్షా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని భార్య కు అందజేశారు. ఈ సందర్భంగా వి ఓ ఎ ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందిన పరమేష్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని మండలంలోని వి ఓ ఎ లు అందరి తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ , పరమేష్ గారి మరణానికి చింతిస్తూ మండలంలోని వి ఓ ఎ లు మరియు జిల్లా యూనియన్ తరపున ఆ భగవంతుడు పరమేష్ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, మా వంతుగా సహాయం చేయాలని సంకల్పిస్తూ,ఏ పి వై ఎస్సార్ క్రాంతి పథం వి ఒ ఎ ల యూనియన్ జిల్లా అధ్యకులు బసవరాజు ఆధ్వర్యంలో పరమేష్ కుటుంబానికి ఒక లక్షా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో వి ఓ ఎ యూనియన్ జిల్లా కార్యదర్శి రంగన్న, గౌరవాధ్యక్షులు మద్దిలేటి, గౌరవ సలహాదారు రామలింగప్ప, ఉపాధ్యక్షులు రవి కుమార్ , ఉప కార్యదర్శి భాస్కర్ నాయుడు , గోనెగండ్ల మండలం యూనియన్ నాయకులు లోకనాత్ రెడ్డి, మిన్నెల్లా, తిక్కన్న, బాలస్వామి, శివానంద, రవి, మల్లేప్రభ, ఉరుకుందప్ప మరియు అలాగే జిల్లా లోని వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author