PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వోడాఫోన్-ఐడియా.. మెజార్టీ వాటా ప్ర‌భుత్వానికి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కంపెనీలోని మెజార్టీ వాటాను ప్ర‌భుత్వానికి అప్ప‌గించిన‌ట్టు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. అయితే కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్ద లాభదాయక పరిస్థితులు కనిపించకపోతుండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ కంపెనీ సమర్థించుకుంటోంది. వొడాఫోన్ ఐడియా .. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ పూర్తి వివరాల్ని తెలిపింది. సోమ‌వారం జ‌రిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్ల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

                                         

About Author