PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిర్ టెల్ బాట‌లో వొడాఫోన్.. సామాన్యుడిపై చార్జీల మోత !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్ర‌ముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. త‌న పోటీ సంస్థ ఎయిర్ టెల్ బాట‌లో న‌డిచేందుకు నిర్ణ‌యం తీసుకుంది. వివిధ ప్రీపెయిడ్ ప‌థ‌కాల‌పై ఎయిర్ టెల్ టారీఫ్ లు పెంచ‌గా.. అదే బాట‌లో వొడాఫోన్ ప‌య‌నిస్తోంది. కాల్, డేటా ప‌థ‌కాల‌పై టారీఫ్ ల‌ను 20 నుంచి 25 శాతం వ‌ర‌కు పెంచ‌నున్న‌ట్టు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. పెంచిన రేట్లు నవంబ‌ర్ 25 నుంచి అమల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. కంపెనీ ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న ఆర్థికప‌ర‌మైన ఒత్తిళ్ల నేప‌థ్యంలో వినియోగ‌దారుడి నుంచి స‌గ‌టు ఆదాయం పెంచుకోవాల‌ని ఆలోచిస్తోంది. టెలికం కంపెనీల నిర్ణ‌యంతో సామాన్య‌ల‌పై అధిక భారం ప‌డుతోంది.

About Author