PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

27న భారత్​ బంద్​కు స్వచ్ఛందంగా సహకరించండి : సీపీఎం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, యజమానులకు అనుకూలంగా మార్చి న కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రజలపై వేస్తున్న పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 27న చేపడుతున్న భారత్ బంద్ కు ప్రజలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా సహకరించి బంద్ ను విజయవంతం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి టి. రాముడు, నగర నాయకులు ఎండి. అంజిబాబు కె .ప్రభాకర్ కోరారు. శనివారం సుందరయ్య సర్కిల్, కొత్త బస్టాండ్, బళ్లారి చౌరస్తా వరకు రోడ్డుకు రెండు వైపులా ఉన్న వ్యాపారస్తులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు యస్,రఫీక్,వి. శంకర్, పి.రమీజాబీ. ఎం.బాస్కర్,చాఁద్, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

About Author