NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పథకాలను ప్రజలకు చేర్చడంలో వాలంటీర్లే కీలకం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో గ్రామ వాలంటీర్లే కీలకమని చౌటుకూరు పంచాయతీ కార్యదర్శి ఎం.రవీంద్రబాబు మరియు విఆర్ఓ రామయ్య  అన్నారు.వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లను చౌటుకూరు ఉప సర్పంచ్ గంధం మరియమ్మ, పంచాయతీ కార్యదర్శులు రవీంద్రబాబు,బీజాన్ బి, విఆర్ఓ రామయ్య శాలువాలతో వాలంటీర్లను సన్మానించారు.గుడిపాడు నుండి ఇద్దరు,49 బన్నూరు నుండి ముగ్గురు,చౌటుకూరు నుండి 11 మంది వాలంటీర్లు మొత్తం 16 మందిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ సామన్న,ఇంజనీరింగ్ అసిస్టెంట్ చరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author