PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌లంటీర్ల‌కు రూ. 233 కోట్ల‌తో సెల్ ఫోన్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్లుగా ఉద్యోగాలిచ్చి జన ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు ? అనే రకం జగన్ మోహన్ రెడ్డి. జనం సొమ్ము దోపిడీ చేసేందుకు జగన్ ఆడని నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వలంటీర్లుగా పెట్టుకుని.. పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారు. వలంటీర్లకి రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చారు. వాటి రీఛార్జీల ఖర్చు ప్రజల డబ్బే.’’ అని లోకేష్ తెలిపారు.

                                        

About Author