PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనుభవానికి అభివృద్ధికి ఓటు వేయండి.. మా నాన్నను ఆశీర్వదించండి..

1 min read

కాటసాని శివ నరసింహారెడ్డి..

పల్లెవెలుగు వెబ్  గడివేముల:  నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసిన తన తండ్రి కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఓటు వేయాలని మంగళవారం నాడు మంచాలకట్ట గ్రామంలో వైయస్సార్ సిపి పార్టీ యువ నాయకుడు కాటసాని శివ నర్సింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజకీయాలలో అనుభవజ్ఞుడు అభివృద్ధి నిరంతర శ్రామికుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కి ఓటు వేయాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మళ్లీ తెచ్చుకోవాలని ఇంటింటికి తిరిగి  ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా మండలానికి రైతుల కోసం ఎస్ ఆర్ బీ సీ నుండి మద్దిలేరుకు నీరు ప్రవహించేలా తన తండ్రి కాటసాని రాంభూపాల్ రెడ్డి చొరవ తీసుకున్నారని అలాగే సోలార్ మైనింగ్ ఫండ్ నిధులతో రహదారులు సీసీ రోడ్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలిపారు అలాగే కేసీ కెనాల్ కాలువ నుండి రైతులకు అదనంగా నీరు ఇప్పించిన ఘనత కూడా కాటసాని దేనని ఈసారి తన తండ్రికి ఓటు వేసి గెలిపిస్తే పూర్తి స్థాయిలో  మండలంలోని ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఇక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అంటూ నవరత్నాలతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముంగిట తెచ్చిన ప్రభుత్వం మరో ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తారని ఈసారి వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ప్రతిపక్షాలకు ఈసారి ఓటమి తప్పదు అన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న వారికి ప్రజలు గుణపాఠం నేర్పుతారన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు మేఘనాథ్ రెడ్డి . అనిల్ కుమార్ రెడ్డి. మండల వైసీపీ అధ్యక్షుడు. శివరాం రెడ్డి ఆనంద్ రెడ్డి. ఎల్లారెడ్డి శ్రీకాంత్ రెడ్డి. సిరుప శ్రీనివాసరెడ్డి. దస్తగిరి రెడ్డి. మేఘనాథ్ రెడ్డి. కో ఆప్షన్ నెంబర్ మహబూబ్ బాషా. ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి. ఉండుట్ల రవీంద్రారెడ్డి. గని ప్రతాపరెడ్డి. మండల స్థాయి వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author