PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి

1 min read

– డి.ఎస్.పి ఎన్. సుధాకర్

చెన్నూరు, పల్లెవెలుగు: గ్రామీణ ప్రాంతాలలో బేశజాలకు వెళ్లకుండా అన్నదమ్ముల వలె కలసి మెలసి.. ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమలాపురం నియోజకవర్గం నోడల్ అధికారి డీఎస్పీ యన్ సుధాకర్ అన్నారు, చెన్నూరులో బుధవారం రాత్రి   ప్రజలకు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగం, గ్రామాలలోని చిన్నచిన్న గొడవలు దానిపై వచ్చే సమస్యల గురించి అవగాహన కల్పించడం జరిగింది, పచ్చని పల్లెల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని సమస్యలు పెంచుకోకుండా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఎలాంటి సమస్యలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన  గ్రామస్తులకు  సూచించారు, ఏవైనా సమస్యలే ఉంటే మీ గ్రామానికి, హెడ్ కానిస్టేబుల్స్, వీఆర్వోలు అందుబాటులో ఉంటారని వారు మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు, అంతే తప్ప మీరెవరు కూడా వివాదాలకు వెళ్లకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండాలని ఆయన తెలిపారు, మీ భూ సమస్యలు, చిన్న చిన్న గొడవలు ఏవైనా ఉన్నచో వాటి పరిష్కారానికి అటు రెవెన్యూ, ఇటు పోలీస్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని ఆయన తెలిపారు, అనంతరం ఆయన గ్రామంలో పల్లెనిద్ర చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీఐ పార్థసారథి పోలీసు సిబ్బందితోపాటు రెవిన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author