PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21 వేల వేతనం పెంచాలని వీఆర్ఏల నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి/వీరబల్లి: వీరబల్లి మండలం లోని గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఏలు తమకు గౌరవ వేతనం 21 వేలు పెంచాలని తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన రెండో రోజుకొనసాగుతోంది. ఎన్నికల సమయంలో సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, డీఏ పెంచాలని, నామినేటెడ్ గా ఉన్న వాళ్లను రెగ్యులర్ చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులు గా చేర్చాలని, నామినిలను విఆర్ఏలు గా నియమించాలని, తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న విఆర్ఏలు పాల్గొన్నారు.

About Author