NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తి శ్రద్ధలతో…శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామి వ్రతం

1 min read

తాళ్లపాక స్వామిజీ చేతులమీదుగా స్వామివారికి ప్రత్యేక పూజలు

పల్లెవెలుగు:శ్రావణమాసం శుభ శనివారం సందర్భంగా నగరంలోని శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతం అత్యంత వైభవంగా జరిగింది.  ఉదయం గోమాత, అభిషేకం, స్వామివారి వ్రతం, హోమం,పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసులు శ్రీ మాన్​ శ్రీశ్రీశ్రీ హరినారాయణ ఆచార్యులు (తాళ్లపాక స్వామిజీ) వారి చేతుల మీదుగా స్వామివారి వ్రతం ఘనంగా నిర్వహించారు. నగరంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు.  పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టారేణుక, ప్రజాప్రతినిధులు, శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్​ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author