NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీఆర్డీ ఎస్  సేవలు అభినందనీయం: డా.ప్రదీప్ కుమార్

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: విఆర్డీఎస్ సేవలు అభినందనీయమని డాక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో విఆర్డీఎస్ అద్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేశారు. విఆర్డీఎస్  సంస్థ స్థాపించి  పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్విహించినట్లు తెల్పారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదిప్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విఆర్డీఎస్ సంస్థ ద్వార చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. విఆర్డీఎస్ సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ గత పదహారు సంవస్తరాలుగా  పేద ప్రజలకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని మండల వ్యాప్తంగా ఆసరా లేని వృద్ధుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే తమ సంస్థ ద్వార ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author