PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెయిటింగ్‌ తప్పదా..?

1 min read

సినిమా డెస్క్​ : యంగ్‌ జనరేషన్ హీరోల కంటే బిజీగా ఉన్నారు నందమూరి హీరో బాలయ్య. ఇప్పటికే అరడజను ప్రాజెక్ట్‌లు ఆయన చేతిలో ఉన్నాయి. అవి కాకుండా మరో నలుగురైదుగురు నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అయితే బాలయ్య ముందుగా తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారట. ‘అఖండ’ సినిమా పూర్తవ్వగానే, గోపీచంద్ మలినేని సినిమాను పట్టాలెక్కిస్తారని, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు వీలైనంత త్వరగా సినిమా సెట్స్ పైకి తీసుకెళతారట. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచనలు మారాయంటున్నారు.
గోపీచంద్ సినిమా తరువాత పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలనుకుంటున్నారట. గతంలో వీరిద్దరూ కాంబోలో ‘పైసా వసూల్’ వచ్చింది. అప్పటినుండి మరో సినిమా చేద్దామని అనుకుంటున్న కుదరడం లేదు. ఇంతలో పూరితో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరితో సినిమా చేస్తున్నా అంటూ బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి పూరితో సినిమాకి మరికొంత సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడి కోసం అనిల్ రావిపూడిని పక్కన పెట్టనున్నారట బాలయ్య. అనిల్ చెప్పిన కథలో బాలయ్య చెప్పిన మార్పులు చేయడానికి సమయం పడుతుందట. కానీ పూరి అయితే కథల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు కాబట్టి ఆయనతోనే అయితే బెటర్‌‌ అన్న డిసిషన్‌కి వచ్చారట బాలకృష్ణ. పూరీ దగ్గర ఆల్రెడీ బాలయ్యకి సూటయ్యే రెండు, మూడు లైన్లు రెడీగా ఉన్నాయి. అందుకే ముందుగా పూరితో సినిమా పూర్తి చేయనున్నారు. 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.

About Author