PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24 వ జాతీయ మహాసభల గోడ పత్రికలు విడుదల..

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ 24వ మహాసభలు విజయవాడ నగరంలో అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవంతంగా జరుగుతున్నాయని ఈ మహాసభలు జయప్రదం కోసం ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి రమేష్ బాబు ఎఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక నందికొట్కూరు పట్టణంలో మహాసభల గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఈ జాతీయ మహాసభలు జరుగుతున్నాయిని, 50 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అంగరంగ వైభవంగా ప్రజలు కార్మికులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు,యువజనులు సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ దిశగా ఈ మహా సభలు జరుగుతున్నాయని మహాసభలు జయప్రదం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జేఏసీ నాయకులు రాజు, నరసింహ, నాజీరు, రాముడు స్వాములు తదితరులు పాల్గొన్నారు.

About Author