PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వచ్చే మూడు రోజులు జాగ్రత్త !

1 min read

పల్లెవెలుగువెబ్ : దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ((ఐఎండీ) శనివారం వెల్లడించింది.తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు,మురుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్ గిత్ బాల్టిస్టాన్, ముజప్ఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి 7వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, కోస్తా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు.

About Author