PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాట‌ర్ బాటిల్ బ‌దులు యాసిడ్ బాటిల్.. గ‌డ‌గ‌డా తాగాక !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య‌వాడ నగరంలోని ఏనికేపాడులో దారుణం జరిగింది. ఓ వ్యాపారి నిర్లక్ష్యనికి డిగ్రీ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఓ దుకాణంలో విద్యార్థి వాటర్ బాటిల్ అడిగితే ఆ దుకాణదారుడు యాసిడ్ బాటిల్ ఇచ్చినట్లు బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. దాహంతో విద్యార్థి చైతన్య గడగడా తాగినట్లు చెబుతున్నారు. యాసిడ్ లోపలికి వెళ్లడంతో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిపాలు కాల్సి వచ్చింది. అవయవాలపై తీవ్ర ప్రభావం పడింది. లయోల కళాశాలలో విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చైతన్య వైద్యానికి కళాశాల యాజమాన్యం విరాళాలు సేకరిస్తోంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

                                  

About Author